by Suryaa Desk | Wed, Sep 18, 2024, 02:30 PM
వనపర్తి జిల్లా సోలిపురం నుంచి ఖిల్లా ఘణపురం మండల కేంద్రం వరకు 10 కి. మీ మేర రోడ్లు భవనాల శాఖ నిధులు 6 కోట్ల 60 లక్షల రూపాయలతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణం పనులకు బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహబూబ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్&బి శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు