by Suryaa Desk | Thu, Sep 19, 2024, 02:51 PM
మండలంలో అధికారులకు ప్రభుత్వం కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జూలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జూలపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు. కనీస విద్యా ప్రమాణాలు ప్రతి విద్యార్థికి అందే దిశగా ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జూలపల్లి మండల తహసిల్దార్ స్వర్ణ, ఎంపీడీవో పద్మజ, మండల ప్రత్యేక అధికారి శంకర్, మండల పంచాయతీ అధికారి అనిల్ రెడ్డి, ఏపిఓ సదానందం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.