by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:19 PM
విద్యార్థులు చదువుతున్న పాఠశాల హలో పచ్చదనము పరిశుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయులు పెండెం రాజు అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం గొల్లవాడ ప్రైమెరీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల పరిసరాలను పరిశుభ్రము చేసి పచ్చదనము పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు పెండెం రాజు మాట్లాడుతూ మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా పాఠశాలను కూడా పచ్చదనం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు.
అప్పుడే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని అనారోగ్యాల బారిన పడకన్నారు. అనంతరం విద్యార్థుల చే వృక్ష రూపం.. మానవహారం ఏర్పాటు చేసి అందులో పంచాయితీ కార్యదర్శి శ్వేత, కారోబార్ రాంబాబు, ఉపాధ్యాయులు బిక్షపతి, నరసింహస్వామి పుష్పలత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలో కావలసిన మొక్కలు నాటుకొని వాటిని మేమే శరనక్షించుకుంటామన్నారు