by Suryaa Desk | Wed, Sep 18, 2024, 02:50 PM
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని ప్రధాన ఆలంపల్లి రోడ్డులో జరుగుతున్న గణేష్ శోభయాత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ గారితో పాటు హైదరాబాద్ రేంజ్ ఐజి సత్యనారాయణ , జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి గారితో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ , కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ తరపున చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక నుంచి నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక నిమజ్జనం సజావుగా జరిగేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బందిని మరియు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని స్పీకర్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మాజీ జెడ్పిటిసి ముక్తహర్ షరీఫ్, కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.cx