by Suryaa Desk | Tue, Sep 17, 2024, 03:38 PM
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రెడ్డిపేట, ఇసాయిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఉద్యోగులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి, తెలంగాణ ప్రగతిని తెలియజేస్తూ పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేశారు. నృత్యాలు చేసిన విద్యార్థులను తెలంగాణ పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధుశర్మ అభినందించారు.