by Suryaa Desk | Sun, Sep 15, 2024, 08:01 PM
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారం తెలంగాణలో హాట్ టాఫిక్గా మారింది. గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్గా ప్రభుత్వం పదవి కట్టబెట్టడంతో ఈ వివాదం మెుదలైంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే పదవి పార్టీ మారిన వారికి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుండగా.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని గాంధీ చెప్పటంతో వివాదం మరింత ముదిరింది. బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ కండువా కప్పుకోవాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసరటం.. ప్రతిగా గాంధీ అనుచురులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లటం ఉద్రిక్తతలకు దారి తీసింది. గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదైంది.
ఈ వ్యవహారం అనంతరం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పంచాయతీ పెట్టుకొని తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకొని.. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లకు వాళ్లకు మధ్య మనస్పర్థలు ఉంచుకొని.. కాంగ్రెస్ పార్టీపై నెపంమోపి ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
శ్రీధర్ బాబు కామెంట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిందెవరి నిలదీశారు. 'అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్లో ఉన్నాడా? సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం. మరి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు ? సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు ? అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు ? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతితెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
శ్రీధర్ బాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన కేటీఆర్.. 'శ్రీధర్బాబును సపోర్టింగ్ రోల్లో ఉత్తమ నటుడిగా నామినేట్ చేస్తున్నాను. భాస్కర్ అవార్డు కోసం.. దయచేసి అతని విజయాన్ని కాంక్షిస్తూ నాతో చేరండి' అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.