by Suryaa Desk | Mon, Sep 16, 2024, 02:29 PM
దేశంలోని బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 150 పెరగడంతో రూ. 68,880 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 160 పెరగడంతో రూ. 75,050 కి చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ.98,000 గా కొనసాగుతుంది.