by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:59 PM
ధర్మారం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గొల్లపల్లి,ధర్మారం,వెల్గటూర్ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా నియమితులు అయిన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం చెగ్యం భూ నిర్వాసితులకు సంబంధించి ఇటీవల లక్ష్మణ్ కుమార్ చొరవతో మంజూరు అయినా 18 కోట్ల రూపాయల చెక్కును జిల్లా అధికారులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ధర్మారంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై,నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనందుకు ఉప ముఖ్యమంత్రి భట్టికి మంత్రివర్యులు శ్రీధర్ బాబుకి,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి,ఎంపి వివేక్ కి,ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని,ధర్మపురి నియోజక వర్గానికి ఒక ఐటిఐ కళాశాలను మంజూరు చేయాలని,అదే విధంగా పత్తిపాక రిజర్వాయర్ పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.