by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:51 PM
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కస్ట్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అన్నారు శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రజానీకానికి శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయ సాధన కొరకు కార్యకర్తలు అందరూ అలుపెరగని పోరాటాలు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం చింతపల్లి మండల కమిటీ సభ్యులు పోలే యాదయ్య కొండమల్లేపల్లి పాత బజారు శాఖ కార్యదర్శి ఎం శ్రీనివాసు ఆర్ సత్యనారాయణ ప్రజా సంఘాల నాయకులు అందుగుల్ల కేశవులు ఆర కంటి ఆంజనేయులు వెంకటయ్య ఏర్పుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.