by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:21 PM
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధి ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి మండలాల పరిధిలలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రివర్యులు దుద్ధిల్లా శ్రీధర్ బాబు , పెద్దపల్లి ఎంపి వంశీ , ఎమ్మెల్యే లు, ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. వారి పర్యటన సందర్బంగా భద్రత పరమైన ఏర్పాట్ల.
వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై, డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలు, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి, అధికారులకు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బీడీ టీం సిబ్బంది కి కాన్వాయ్ సిబ్బందికి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.