by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:24 PM
నల్లగొండ పట్టణంలోని 13వ వార్డు విద్యుత్ నగర్ కాలనీలో మరియు హనుమాన్ నగర్ లో గణేష్ మండపముల వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా నల్లగొండ డిఎస్పీ గారు శ్రీ శివరాం రెడ్డి గారు విద్యుత్ కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కంచరకుంట్ల వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు మరియు విద్యుత్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు కూడా పాల్గొన్నారు.
ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ నల్లగొండ గోవిందు లావణ్య దంపతులు మరియు ముక్కాల రాజు ప్రియాంక దంపతులు కలిసి నిర్వహించినారు ఈ కార్యక్రమంలో విద్యుత్ నగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు సంపత్,శ్రీనివాస్,శ్రవణ్,మురళి,రాంబాబు, వెంకన్న, సందీప్, నాగరాజు,యాదగిరి రెడ్డి,శంకరయ్య చారి, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, రవి, పాల్గొన్నారు