by Suryaa Desk | Tue, Sep 17, 2024, 01:04 PM
ప్రజా పాలన దినోత్సవంను పురస్కరించుకుని మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ముఖ్యఅతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.