by Suryaa Desk | Mon, Sep 16, 2024, 12:40 PM
హైదరాబాద్లోని మణికొండ అల్కాపూరి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించాడు. శ్యామ్ 15 లక్షల వరకు లడ్డు వేలం పాట పాడిన అనంతరం.. గణనాథుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా కుప్పకూలిన శ్యామ్ ప్రసాద్ గుండె పోటుతో మృతి చెందాడు.