by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:12 PM
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో హుస్సేన్ నీ క్లర్క్ పాముల వెంకటేశ్వర్లు ని పాలకవర్గం విధుల నుండి తాత్కాలికంగా తొలగిస్తూ మంగళవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘ కార్యాలయంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన కటాఫ్ తేదీగా నిర్ణయించగా సంఘంలోని కంప్యూటర్ నగదు పుస్తకం నందు నమోదు కానందున ఋణ మాఫీ జాబితా నందు పుట్టా కవిత, భర్త శ్రీనివాసరావు అర్హుల జాబితానందు నమోదు చేయకపోవడంతో వారికి రుణమాఫీ వర్తించలేదు. దీనికి బాధ్యులైన సంఘ కార్యదర్శి కంప్యూటర్ ఆపరేటర్ ఇరువురిపై జిల్లా సహకార అధికారి ఆదేశానుసారం షోకాజు నోటీసులు జారీ చేసి సంజాయిషీ ఆదేశించినప్పటిికి నేటి వరకు ఎటువంటి సంజాయిిషీ సమర్పించలేదని తెలిపారు.
66 మందికి సంబంధించిన రుణమాఫీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇందుకు బాధ్యులైన సీఈవో ఎస్కే హుస్సేన్, కంప్యూటర్ ఆపరేటర్ పాముల వెంకటేశ్వర్లు ఇరువురిని కార్యవర్గ తీర్మానం అనుసరించి సంఘ విధుల నుండి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.సీనియర్ క్లర్క్ అయిన మౌలాలి కి తాత్కాలిక సెక్రటరీగా విధులు నిర్వర్తించవలసినదిగా ఆదేశించారు.