by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:16 PM
టేకులపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్ట్ పై అఖిలపక్ష సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మి గణపతి, ఎంపీఓ గాంధీ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే గ్రామపంచాయతీ కార్యదర్శి రాతపూర్వకంగా ఇవ్వాలని అఖిలపక్ష నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సురేందర్, దేవా, రామచంద్ర పాల్గొన్నారు.