by Suryaa Desk | Thu, Sep 19, 2024, 02:38 PM
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కొందరు, శిల్పాకళావేదిక వద్ద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మరికొందరు విరాళాల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అందజేశారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు రూ.2.5 కోట్లు, శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ రూ.కోటి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఛైర్పర్సన్ రూ.50 లక్షలు, మోల్డ్టెక్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రూ.25 లక్షలు అందజేశారు. లారస్ ఫార్మా ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా ముఖ్యమంత్రికి అందజేశారు. టెక్నో పెయింట్స్ డైరెక్టర్లు ఆకునూరి శ్రీనివాస్రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ రూ.20 లక్షల చెక్ ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి తదితరులు రూ.5 లక్షలు.. కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం అందజేశారు.