by Suryaa Desk | Thu, Sep 19, 2024, 02:34 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో..మహాలక్ష్మి పథకాన్ని లాంచనంగా ప్రారంభించి, లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేసిన పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి.. లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతోందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా 34,698 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు.