by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:22 PM
గత శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ ఎన్నారై పాలసీ అమలు చేయలని నిర్ణయించి ఈ మేరకు జీవో విడుదల చేయడం పట్ల కోరుట్ల పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గల్ఫ్ ఎన్నారై పాలసీ తీసుకొస్తామని గత టి ఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కానీ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ పాలసీ తీసుకొస్తామని చేర్చి ఈ మేరకు అధికారంలోకి రాగానే అమలు చేయ పూనుకోవడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు.
అలాగే ఈ పాలసీ కోసం కసరత్తు చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ పాలసీ అమలు కోసం విధివిధానాలను సూచించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అందరికీ కూడా ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.