by Suryaa Desk | Thu, Sep 19, 2024, 12:29 PM
యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సచివాలయంలో దేవాదాయశాఖపై సమీక్షించారు. రాయగిరిలో 20 ఎకరాల్లో రూ.43 కోట్ల వ్యయంతో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గోవిందహరి ఛైర్మన్గా వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలుపెడతామని పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాల్లో 3 సర్క్యూట్లలో భక్తులకు వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వార భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. 42 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం కొండ కింద గల సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఇందులో రూ.2,98,48,233, బంగారం 205 గ్రాములు, వెండి 5.710 కిలోలు వచ్చిందని ఈవో భాస్కర్రావు చెప్పారు. అలాగే హుండీలలో అమెరికా, యూఏఈ, యూరోప్, నేపాల్తో పాటు పలు దేశాలకు కరెన్సీ భారీ మొత్తం వచ్చింది.