by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:32 PM
తెలంగాణ బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ ఆదేశానుసారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయు స్థానంలో, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు నిరసనగా, పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం, పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సచివాలయం శాసనసభ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీక.అటువంటి చోట కెసిఆర్ ఏందో ముందు చూపు ఆలోచన భాగంగానే ఇటుపక్క రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని,మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాన్ని సైతం అర్పించిన అమరవీరుకు ప్రతీకగా అమరవీరుల జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది.వీటి మధ్యలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందని ఉద్దేశంతో ఏర్పాటు చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సంకల్పించడం జరిగింది.కావాలని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి స్థలంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం.
శోచనీయం. తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మంది ఆకాంక్ష అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను పక్కనపెట్టి వారి స్వలాభం కోసం, గాంధీ కుటుంబానికి దగ్గర కావాలని ఆకాంక్షతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే స్థలం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒక స్వలాభం కోసం పెట్టిన ఆ విగ్రహాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తిరిగి కెసిఆర్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని, అంతేకాకుండా ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాన్ని తొలగించి ప్రజల ఆకాంక్ష మేరకు వారు ఏదైతే కోరుకున్నారో అదే స్థలంలో తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట రాములు,మాజీ సర్పంచులు,మాజీ వార్డు మెంబర్లు,కౌన్సిలర్లు,మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.