by Suryaa Desk | Sun, Sep 15, 2024, 08:22 PM
లక్ష్మణచాంద మండల కేంద్రంలో ఆదివారం శివాజీ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ర్యాలీగా తరలి వచ్చి విగ్రహావిష్కరణ చేశారు. శివాజీ నామస్మరణతో ఆవిష్కరణ పరిసరాలను హోరేత్తించారు. ఈ కార్యక్రమంలో అడ్వాల రమేష్, వొస రాజేశ్వర్, ముత్యం రెడ్డి, ఈటెల శ్రీనివాస్, రామ్ రెడ్డి, బిట్లింగ్ రజని, వొస రాజు, రాకేష్, శ్రీకాంత్, గ్రామస్థులు పాల్గొన్నారు.