by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:55 PM
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉప సంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అందోలు మల్లేశం డిమాండ్ చేశారు. శనివారం జోగిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటి వేయడం సమంజసం కాదన్నారు. మాల కులానికి చెందిన మంత్రి లేకుండా కమిటిని ఎలా నియస్తారని ఆయన ప్రశ్నించారు. ఏకంగా మంత్రుల కమిటీ లోనే మాలలకు అన్యాయం జరిగితే ఇక ఈ కమిటీ మాల సమాజానికి ఎలా న్యాయం చేసుందన్నారు. కమిటీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కమిటీలో ఉంటే మాలలకు న్యాయం జరగదన్నారు.
తెలంగాణ లో మాదిగల జనాభా కంటే మాల , మాల ఉప కులాల జనాభా ఎక్కువగా ఉందని అన్నారు. మంత్రుల కమిటీని రద్దు చేసి సిట్టింగ్ న్యాయమూర్తి నేత్రుత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు దీనబాందవ్, నియోజకవర్గ నాయకులు మ్యాతరి కరుణాకర్, మండల ఉపాధ్యక్షులు పరిపూర్ణం, మండల ముఖ్య సలహాదారులు బహుజన ప్రసాద్, సటికే రాజు, దాసరి దుర్గయ్య, పెండ గోపాల్, చెట్టయ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.