by Suryaa Desk | Sun, Sep 15, 2024, 08:16 PM
జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాడమే మా లక్షణ పెట్టుకొని పని చేస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ దామెర అనిత అన్నారు. శనివారం ఆత్మకూరు మండలం పెద్దాపురం జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పేరెంట్స్ మీటింగులో విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చించిన అనంతరం ప్రిన్సిపాల్ దామెర అనిత మాట్లాడుతూ విద్యార్థుల రక్షణ కోసం వారి తల్లిదండ్రులు సిసి కెమెరా ఏర్పాటు కోసం సహకరిస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు. అలాగే పాఠశాల ఆవరణలో సిమెంట్ బెంచ్ లను ఏర్పాటు చేయడం వల్ల పిల్లల కోసం వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు వాటిపై ఆసీనులు కావచ్చు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, సమస్యలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ప్రణాళికతో విద్యార్థులను చదివిస్తూ ర్యాంకులు సాధిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సీసీ కెమెరాల కోసం బెంచీల కోసం సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. హిందీ దివస్ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి వేదికల నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.