by Suryaa Desk | Sat, Sep 14, 2024, 11:56 AM
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు. వీకెండ్ కావడం, ఆదివారం వరకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.