by Suryaa Desk | Sat, Sep 14, 2024, 11:37 AM
సైదాపూర్ మండలం ఆకునూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సమ్మయ్య, సుధాకర్ శుక్రవారం ఉదయం శంకరపట్నం నుండి స్కూటీపై పాఠశాలకు బయలుదేరారు. సోమారం శివారులో ఒక కారును ఓవర్ టేక్ చేసి సైదాపూర్ నుండి మోడల్ స్కూల్ వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగ ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.