by Suryaa Desk | Sun, Sep 15, 2024, 03:05 PM
MBBS, BED కోర్సుల్లో తాజాగా పెట్టిన స్థానికత నిబంధనతో హైదరాబాద్లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని వారు విజయవాడ, గుంటూరులో ఇంటర్ చదువుతారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన స్థానిక నిబంధనలతో ఇలా ఇంటర్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి స్థానికత కోటా ఉండడంలేదు. తెలంగాణలో పుట్టి, పెరిగి రెండేండ్ల ఇంటర్ కోసం ఏపీకి వెళ్లిన వారు సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోతున్నారు. ఇది ప్రైవేట్ కాలేజీలకు లబ్ధి చేకూరుస్తోంది.