by Suryaa Desk | Sat, Sep 14, 2024, 04:22 PM
బాలికల అక్రమ రవాణా అరికట్టి వారికి బంగారు భవిష్యత్తు ఇద్దామని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోల్ సిఐ వెంకన్న అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చైల్డ్ హెల్ప్ లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ మానవ రవాణాను అరికట్టే విధానాలను విద్యార్థులకు వివరించారు.
బాలికల బంగారు భవిష్యత్తు కోసం అందరు కృషి చేయవలసిన సమయం ఆసందమైందన్నారు. ప్రిన్సిపాల్ దామెర అనిత, ఏఎస్ఐ భాగ్యలక్ష్మి, అవల్దార్ నరేందర్ కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, చైల్డ్ లైన్ సభ్యులు రమేష్ విజయ్ దామోదర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.