by Suryaa Desk | Sat, Sep 14, 2024, 04:18 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు సీఐ, గూడురు ఎస్సై లు, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల తనిఖీలలో ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని, వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు.
ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, బండి ఇవ్వడం. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. బాబురావు తెలిపారు.