by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:20 PM
కరీంనగర్ జిల్లా మానకొండూర్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు రాయికంటి కిరణ్ ను మానకొండూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.కిరణ్ తో పాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాధవరం సంజీవ రావు,గడ్డి రాజును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,అరికెపూడి గాంధీల మధ్య జరుగుతున్న సవాల్ లు ప్రతి సవాల్ ల వ్యవహారంలో తమను ముందస్తుగా అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు.ఈ సందర్భంగా రాయికంటి కిరణ్ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇలాంటి అరెస్టులు కొత్త కాదని,అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని,పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజా క్షేత్రంలో తిరగకుండా చేస్తామని అన్నారు హెచ్చరించారు.