by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:18 PM
దళిత యువకుడి ని కిడ్నప్ చేసి దాడి చేసి చంపడానికి ప్రయత్నంచిన, బీటీ రాజేందర్, మహేందర్, భాస్కర్ గౌడ్, చెలుక బాలరాజ్,రాము, శ్రీనివాస్ ల పై SC ST అట్రాసిటీ కేసు,హత్య హత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఎనికెపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు నట్టల మనోహర్ ని అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన బీటి రాజేందర్,బీటి మహేందర్,భాస్కర్ గౌడ్,చెలుక బాలరాజ్ రాము,శ్రీనివాస్ కిడ్నప్ చేసి ఇనుప రాడ్ లు,కట్టెలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు.
మనోహర్ దెబ్బలకు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నం కు పాల్పడడం జరిగింది. చెందిన బీటి రాజేందర్, బీటీ మహేందర్ వీరిని నట్టల మనోహర్ కుటుంబ సభ్యులు మా కొడుకును ఎందుకు కొట్టారని అడిగితే మీరేం చేసుకుంటారు. చేసుకోపోండి మాకు అన్ని తెలుసు అని, ఫోన్ చేసి బెదిరిపులకు పాల్పడుతున్నారు. దళిత మహిళలను చూడకుండా నానా బూతులు తిడుతూ అవమాన పరచడం జరిగింది.దళిత మనోహర్ని కిడ్నాప్ చేసి దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన నిందితుల పై చట్టపరమని చర్యలు తీసుకొని,కఠినంగా శిక్షించాలి అని ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిందితు లపై చట్ట పరం అయినా చర్యలు తీసుకొని యెడల,కేవీపీస్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పకీరప్ప,దస్తప్ప అనంతప్ప,తదితరులు పాల్గొన్నారు.