by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:27 PM
గొర్రెల మందపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16 గొర్రెలు, ఒక గేద మృతి చెందిన సంఘటన అక్కంపేట గ్రామంలో చోటుచేసుకుంది.శుక్రవారం బాధితుడు గోనె వంశీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన వంశీ బతుకు తెరువు కోసం కులవృత్తిని నమ్ముకొని గొర్రెలను పెంచుకుంటున్నారు.గురువారం సాయంత్రం మేపుకొని వచ్చి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన దొడ్డిలో ఉన్న గొర్రెల మందపై అర్థరాత్రి గ్రామంలోని కుక్క లు మూకుమ్మడిగా ఒకేసారి దాడి చేయడంతో గొర్రెల అరుపుల నువిని బయటకు వచ్చి చూచే వరకు కుక్కలు గొర్రెల పై దాడి చేస్తున్నాయి.
వెంటనే కర్రలతో కుక్కలను తరిమికొట్టాము. అప్పటి వరకే 16 గొర్రెలు మృతి చెందింది పడి ఉన్నాయి. అలాగే పాడి గేదె కూడా కుక్కల దాడితో మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో కుక్కలు సైన్య విహారం చేస్తున్నాయని అధికారులకు పలుమార్లు తెలిపిన కూడా పట్టించుకోవడంలేదని బాధితులు వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. 16 గొర్రెలు పాడి గేదె మృతి చెందడంతో రెండు లక్షల పైన ఆర్థికంగా నష్టపోయానని నాకున్న ఉపాధిని కోల్పోయానని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. నాకు అధికారులు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతున్నాడు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే నాకు ఈ నష్టం కలిగేది కాదని గోనె వంశీ ఆవేదన వ్యక్తం చేశారు.