by Suryaa Desk | Sat, Sep 14, 2024, 04:05 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంపరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, వినాయకుని పలు మండపాల వద్ద, ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాలు పలుచోట్ల విస్తృతంగా, ప్రతి గ్రామ గ్రామాన భక్తులు చేపడుతున్నారు. అదే తరహాలో అయోధ్యాపురంలో కాకతీయ, కొమురం భీమ్ యూత్ క్లబ్ ల వారి ఆధ్వర్యంలో, శుక్రవారం రోజు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో, వినాయకునికి అయ్యవారి చేత భక్తులు ప్రత్యేక పూజలు జరిపించారు.
తదానంతరం అద్వితీయంగా భక్త జనులందరికీ మహోన్నదాన కార్యక్రమం కనుల పండుగగా చేశారు. కొమురం భీం యూత్ క్లబ్ వినాయకుని మండపం వద్ద, అన్న బోయిన దేవేందర్ కవిత పుణ్య దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమాన్ని కాకతీయ, కొమురం భీమ్ యూత్ క్లబ్ ల సభ్యులందరూ మూకుమ్మడిగా, ఈ మహోన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు.