by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:47 PM
పాడిపంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాన్వేసింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి అన్నారు. వర్తక సంఘం బజార్లో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద ఏడవ రోజు కుంకుమ పూజ మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్తక సంఘం బజార్లో ప్రతి సంవత్సరం గణనాధుని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజిస్తామని తెలిపారు.
అందుకు షాప్ యజమానులు, అసోసియేషన్ సభ్యులు ప్రతి సంవత్సరం సహకరిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మధు కార్యదర్శి రాజారావు సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి సతీష్ కుంకుమ పూజకు సహకరించిన దాతలు మధు అశోక్ సతీష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.