by Suryaa Desk | Sat, Sep 14, 2024, 07:23 PM
ఇటీవల వైరాలో డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందినిపై దుష్ప్రచారం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైరా కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం సతీమణి తమకు సహకరించిందని తప్పుడు ఆరోపణ చేస్తూ కొందరు దుష్ప్రచారానికి దిగారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.