by Suryaa Desk | Sat, Sep 14, 2024, 07:20 PM
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. 16న వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నిమజ్జనం ప్రాంతాలలో నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందన్నారు.