by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:41 PM
మెట్ పల్లి సర్కిల్ పరిధిలో ఈనెల 16, 17 వ తేదీల్లో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నట్లు శనివారం మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమాల్లో అల్లర్లు సృష్టించే వారిపై రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా రౌడీ షీటర్లు, ఆటంకం కలిగించే వారితో పాటు డీ జె నిర్వాహకులను తహశీల్దార్ ల ఎదుట బైండో వర్ చేయడం జరిగిందని తెలిపారు. మెట్ పల్లి లో 96 మందిని, మల్లాపూర్ లో 42 మంది, ఇబ్రహీంపట్నం లో 37 మందిని బైండో వేర్ చేసినట్లు తెలిపారు.
కొత్తగా ఎవరైనా నిమజ్జనం రోజున అల్లర్లు చేసి ఆటంకం కలిగిస్తే వారిపై కూడా రౌడీ షీట్లు తెరుస్తాం. రౌడీ షీట్ల తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. నిమజ్జనం మధ్యాహ్నం 12గంటల నుంచి మొదలు పెట్టి రాత్రి 11గంటల లోపు ముగించాలన్నారు. డీ జె నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ బాక్సలు ఇవ్వవద్దన్నారు. ఒకవేళ ఇస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు పెడతామన్నారు. అలాగే మద్యం షాపులు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో కూడా ఎక్కడైనా మద్యం అమ్మితే తీవ్ర మైన చర్యలు ఉంటాయన్నారు.నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.