by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:51 PM
సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీ రోడ్ నంబర్–3 పోతిరెడ్డి పల్లి లోని వినాయక మండపంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్యవైద్య శాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ పూజలు నిర్వహించారు. గజానంద్ యువజన సంఘం యువకులు ఆహ్వనం మేరకు మంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ సభ్యులు మంత్రిని శాలువాతో సన్మానించారు.
కాలనీ భక్తులు మరియు గజానంద్ యువజన కమిటీ సభ్యులు వితరణ చేసిన అన్నదానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో సుమారుగా వెయ్యి మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి, యూత్ సభ్యులు ముఖేష్ చంద్ర నాయక్, ఆదిత్య,వివేక్ నాయక్, వినయ్, రోషన్,శివకుమార్, వెంకట్ రెడ్డి,సుదీర్ రెడ్డి,నిఖిల్, పవన్, గణేష్, ఉద్బవ్ రెడ్డి, రాహుల్, ఆనంద్, ప్రదీప్, జస్వంత్ శశాంక్ రెడ్డి, వంశిదర్ రెడ్డి, శివ సాయి,చంద్రమోహన్, జయంత్ రాజ్,అరుణ్ కుమార్, ప్రశాంత్,గోపాల్ రాథోడ్, విట్టల్ గౌడ్, సుధాకర్ రెడ్డి, జయరాం నాయక్, రమేష్ బాబు, శోభన్ బాబు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.