by Suryaa Desk | Sat, Sep 14, 2024, 06:39 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాయారావు చెరువు వద్ద సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప అశోక్ గౌడ్ శనివారం పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా చెరువు వద్ద సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. కొండల మధ్య చెరువు ఉండడం పర్యాటకులకు ఎంతగానో ఆహ్లాదాన్ని అందించే విధంగా సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.