by Suryaa Desk | Sat, Sep 14, 2024, 02:59 PM
సీఎం సహాయనిధి పేదలకు ఆసరాగా నిలిచి ప్రాణాలను కాపాడుతోందని కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్. సినియర్ నాయకులు జర్నలిస్ట్ మూర్తి నరేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం చేర్వాపూర్ 6 వ వార్డు లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపించేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధితో నేడు నిరుపేదలు కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని నిరుపేదల ఆరోగ్యం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లుప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు.