by Suryaa Desk | Sat, Sep 14, 2024, 02:55 PM
గాజులరామారం డివిజన్ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత మరియు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి ఆద్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, గాజులరామారం డివిజన్ ఇన్ ఛార్జ్ జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు కట్ట కుమార్ లు హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మోర్చా నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.