by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:39 PM
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో భరత్ నగర్ యువసేన ఆధ్వర్యంలో గణపతి హోమం,మహిళలచే కుంకుమ అర్చన కార్యక్రమం శనివారం చేపట్టారు.గత రెండు నెలలుగా గ్రామంలో విష జ్వరాలు ప్రబలడంతో గ్రామస్తులు త్రీవ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇట్టి సమస్యలు తొలగాలని యజ్ఞం నిర్వహించినట్టు యూత్ సభ్యులు తెలిపారు.
అనంతరం మహిళలు కుంకుమార్చన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా అన్నప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు అన్నారపు గంగాధర్, ఉపాధ్యక్షులు ఏశాల సతీష్, కోశాధికారి మాదరవెన రాకేష్ మరియు భక్తులు పాల్గొన్నారు.