by Suryaa Desk | Sun, Sep 15, 2024, 03:30 PM
పూజ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు గారు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మా రెడ్డి గార్లతో పాటు స్థానిక మునిసిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు.కుత్బుల్లపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని ఈరోజు మాజీ మంత్రులు, హరీష్ రావు గారు, మల్లారెడ్డి , ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు , బండారి లక్ష్మా రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎరోళ్ళ శ్రీనివాస్ , నందికంటి శ్రీధర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు, పూజ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి సత్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .... వారు మాట్లాడుతూ ఆ దేవ దేవుడు మహాగణపతి స్వామి వారు ప్రజలందరూ చల్లగా ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు....