by Suryaa Desk | Sat, Sep 14, 2024, 02:20 PM
పాఠశాల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి ఎస్జీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎలియాస్ రావు లు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిగుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడలు నిర్వహించేందుకు కాను శుక్రవారం టాక్టర్ తో క్రీడా స్థలాన్ని సిద్ధం చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మండల స్థాయి క్రీడా పోటీలు కబడ్డీ కోకో వాలీబాల్ బాలబాలికలకు వేరువేరుగ నిర్వహించి గెలుపొందిన విజేతలను మండలము నుండి జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఈ క్రీడా పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనేవారు ఎస్జీఎఫ్ పీజూ ను జిల్లా విద్యాధికారికి చెల్లించిన వారికి క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనసూయ, పీఈటీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు...