by Suryaa Desk | Mon, Aug 12, 2024, 03:35 PM
డబ్బు ఖర్చు చేసినంత మాత్రాన పతకాలు సాధించలేమని ఒలింపిక్స్ లో భారత తొలి వ్యక్తిగత స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా అన్నారు. "రక్తం, చెమట, కన్నీళ్లు, మైదానంలో చూపే పట్టుదల, తెగువ, ఆటగాళ్లను పతకానికి చేరువ చేస్తాయి. అయితే శిక్షణకు, ప్రయాణానికి డబ్బు కావాలి. అంత మాత్రాన అది వెండింగ్ మెషిన్ కాదనే విషయం అర్థం చేసుకోవాలి" అని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్ 6 పతకాలు సాధించింది.