by Suryaa Desk | Mon, Aug 12, 2024, 04:09 PM
చించోలి లో నీలం మధు కు కర్ణాటక కోలీ సమాజ్ ఘన సత్కారం.జాతీయస్థాయిలో కోలీ (ముదిరాజ్ ) సమాజ్ బలోపేతానికి కృషి చేస్తానని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం కర్ణాటక లోని చించొలి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. చించోలి పట్టణ కేంద్రంలోని కోలీ సమాజ్ భవనంలో కోలి సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి స్థానిక ఇంచార్జ్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభాష్ రాథోడ్ గారితో కలిసి హాజరయ్యారు.ఈ సంధర్బంగా చించొలి కోలీ సమాజ్ ఆధ్వర్యంలో నీలం మధు ను ఘనంగా సత్కరించారు. చించొలి లో నిర్మించిన కోలీ సమాజ్ భవనానికి నీలం మధు సంపూర్ణ సహకారం అందిస్తా అన్నారు.అనంతరం నీలం మధు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో రెండు కోట్లకు పైగా దేశ జనాభాలో 6% పైగా ఉన్న కోలీ సమాజ్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగి మన జాతి ఐక్యతకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యమత్యంగా కలిసి ఉన్నప్పుడే రాజకీయంగా అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. మన జాతి రాజకీయంగా ఎదిగేతేనే మన జాతికి న్యాయం చేసుకునే అవకాశం వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే దిశగా పని చేస్తుందన్నారు. కర్ణాటకలోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో ఇక్కడ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులకు గుర్తింపు దక్కుతుందన్నారు.
మన కోలీ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి మనమంతా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం కోలీ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ జాతీయస్థాయిలో సంఘం బలోపేతానికి మేమంతా మీ వెంట ఉంటామని మమ్మల్ని ముందుండి నడిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,స్థానిక ఇంచార్జ్ సుభాష్ రాథోడ్,కోలి సమాజ్ రాష్ట్ర కార్యదర్శి లక్మన్ ఆవంటి, నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సురేష్ బంట, నియోజకవర్గ కౌలి సమాజ్ ప్రెసిడెంట్ అనిల్ జమేదార్ ,రాములు షాదీపూర్, టౌన్ పంచాయత్ నెంబర్ అబ్దుల్ భాషిత్,జనార్ధన్, అనంద్ టైగర్,జాయిప్ప, గాలి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, స్ధానిక నాయకులు,తదితరులు, పాల్గొన్నారు..