by Suryaa Desk | Tue, Aug 13, 2024, 01:36 PM
మరికల్ మండల కేంద్రంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు జాతీయ నాయకులు అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలను శుభ్రం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.