by Suryaa Desk | Tue, Aug 13, 2024, 03:40 PM
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో వివిధ శాఖలకు చెందిన నిరుపయోగంగా శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఎమ్మార్వో నివాసాన్ని పరిశీలించారు. గత కొన్ని ఏళ్ల నుండి నేటి వరకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించి ఇతర ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.