by Suryaa Desk | Tue, Aug 13, 2024, 07:32 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు N6ఛానల్ నిర్వాహకులు అంతిరెడ్డి కరుణాకర్ రెడ్డి మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి వారి పార్థీవ దేహానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.