by Suryaa Desk | Wed, Aug 14, 2024, 02:04 PM
బీబీఏ విద్యార్థులు నూతన పద్ధతులు నూతన వస్తువుల ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాంసాని సత్యనారాయణ కోరారు. స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ అటనామస్ డిగ్రీ కళాశాలలోని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు ఏర్పాటుచేసిన నూతన వస్తువుల పోస్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రిన్సిపల్ సత్యనారాయణ ప్రసంగించారు.