ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు.. వారిని రహస్యంగా కలిసినందుకే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 05:45 PM

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం కోడ్ ఉల్లంఘన చర్యలకు పాల్పడినా.. పోలీసు కేసులు ఎదుర్కొక తప్పదు. తాజాగా.. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆదివారం అర్థరాత్రి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ భవనంలో రహస్యంగా మీటింగ్ పెట్టారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి ఉద్యోగులతో భేటీ అయిన భవనానికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa